నందలూరు మండలంలో “జనంలో జనసేన”

రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు
యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో
నందలూరు మండలంలో “జనంలో జనసేన” కార్యక్రమం శుక్రవారం 2-2-2024 ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో చెన్నయ్యగారిపల్లె, ఎలమరాజు పల్లె, ఈదరపల్లె, దుర్గాపురం లలో జనసేన నాయకులు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు “గాజు గ్లాస్”ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందలూరు జనసేన నాయకులు ఆకుల చలపతి, ప్రశాంత్ భారతాల, తిప్పాయపల్లి ప్రశాంత్, వెలకచెర్ల హరిబాబు, భత్యాల వినయ్, మంటి వెంకటసుబ్బయ్య, పోకూరి మల్లికార్జున, పాలూరు మహేష్, పైడికొండ్ల సునీల్ గౌడ్, చంద్రమౌళి, సుధాకర్, నరసింహ, సుబ్బు, బాలాజీ, వర్ల కార్తీక్, కరీముల్లా, హేమంత్, చిన్నయ్య, నరసింహ, నాని, హరిబాబు మరియు నందలూరు జనసైనికులు పాల్గొన్నారు.