జనసేన ఉచిత వైద్య శిబిరం

రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, పింక్ హార్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, విజయ హాస్పిటల్స్ అధినేత, డాక్టర్ రాపాక రమేష్ బాబు ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి షుగర్ వ్యాధులు, గుండెవ్యాధులు, ఈసీజి, షుగర్ పరీక్షలు, జనరల్ వ్యాధుల పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఉచితంగా పంపిణీ చేసేలా మరియు ఉచిత దంత వైద్యం చింతలమోరి గ్రామంలో మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షులు ఒగురి మనోహర్ అద్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంఛార్జి పితాని బాలకృష్ణ ప్రారంభించారు. జనసేన పార్టీ నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పితాని బాలకృష్ణ పాల్గొని ఆయన మాట్లాడుతూ డాక్టర్ రాపాక రమేష్ బాబు సేవలు అభినందనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజీ, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవికిరణ్, ఎంపీపీ మేడిచర్ల రాము, బోనం సాయి, వైస్ ఎంపీపీ ఇంటిపళ్లి ఆనందరాజు, మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, సూరిశెట్టి శ్రీనివాస్, ఉండపల్లి అంజి, ఎంపీటీసీ లు జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, దార్ల కుమారి లక్ష్మీ చినబాబు, అవుపాటి శివ జ్యోతి సుబ్రమణ్యం, గుండుబోగుల పెద్దకాపు, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, ఉండపల్లి అంజి, జిల్లేళ్ళ రక్షక్, ఆచంట బాబులు, శేఖర్, మలే కాళిదాస్, ముప్పర్తి సత్య శ్రీనివాస్, ముత్యాల జగదీష్, బోనం భాస్కర్, శ్రీనివాస్, బళ్ల సురేష్, ముత్యాలరావు, పోలిశెట్టి గణేశ్, దొడ్డ సాయి ప్రసాద్,రాపాక మహేష్, మండ బల్లియ్య, దొడ్డ వెంకటేశ్వరరావు, ఆళ్ళ శ్రీను, దొడ్డ గణేశ్, గొల్లకోటి రాంబాబు, దొడ్డ రాంబాబు, దొడ్డ త్రినాధ్, దొడ్డ ప్రసాద్, ర్యాలీ శ్రీను, తేనేటి రమేష్, రాపాక చంద్రశేఖర్, సురేష్, నల్లి విజయారత్నం, నక్కా సంజయ్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, క్రియాశీలక సభ్యులు, గ్రామ పెద్దలు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.