చెరుకుపల్లిలో వేసవికాలం నిమిత్తం జనసేన మంచినీటి చలివేంద్రం

మహాశివరాత్రి సందర్భంగా చెరుకుపల్లిలో వేసవికాలం నిమిత్తం మంచినీటి చలివేంద్రంను జనసేన పార్టీ నాయకులు యాజలి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా కార్యదర్శి మత్తి భాస్కరరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాదె లక్ష్మణరావు, కారుమంచి కోటేశ్వరరావు, చెరుకుపల్లి మండల నాయకులు కాజా నాగేశ్వరరావు, గోపరాజు ఉదయ్ కృష్ణ, పూడివాడ ప్రదీప్, ఉల్లంఘల శ్రీనివాసరావు, తాత పోలేరయ్య తదితరులు పాల్గొన్నారు.