అమరావతి రైతులకు జనసేన పూర్తి మద్దతు

తిరుపతిలో జరిగిన అమరావతి పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఈ కార్యక్రమంలో పాల్గొని జనసేన పార్టీ తరపున వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని మా పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు అమరావతి రైతుల గురించి అమరావతి గురించి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందని మన రాజధాని అమరావతినే అని ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జులు, ముఖ్య నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు మరియు అన్ని రాజకీయ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతుల ప్రజా పాదయాత్ర అఖిల పక్ష సమావేశానికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరి ప్రసాద్ , కిరణ్ రాయల్ , శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జి.డి నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జి డా. యుగంధర్ పొన్నా, జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, జిల్లా కార్యదర్శి మనోహర్ దేవర, పార్ధు మరియు ఇతర పార్టీ నాయకులు మరియు జనసైనికులు, వీరమహిళలు తిరుపతిలో జరిగిన రైతుల అఖిల పక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది.