జనసేన గిరిసేన – జనంవద్దకు జనసేన 45వ రోజు

  • చలో రణస్థలం..

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం జనసేన గిరిసేన – జనంవద్దకు జనసేన 45వ రోజు కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం టౌన్ యువతతో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనవరి 12న రణస్థలంలో జరిగే యువశక్తి కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క యువతి యువకులు రావాలి అని యువశక్తి కార్యక్రమం అనేది జనసేన పార్టీ కోసం కాదు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులుగా ఉన్న యువత కోసం మీయొక్క సమస్యను మీ గళాన్ని వినిపించడం కోసం జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని జనసేన జానీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రమేష్ పొట్నూరు, జామి అనిల్, దిలీప్, అనిల్, గణేష్ మరియు జనసైనుకులు పాల్గొనడం జరిగింది.