తిరుపతి వరద బాధితులకు అండగా జనసైన్యం
తిరుపతి, జవాద్ తుఫాన్ భారీ వర్షం, వరదల రూపంలో తిరుపతి నగరాన్ని చుట్టుముట్టింది. వరదలతో ముంచెత్తింది. బయటకు కాలు పెట్టడానికి వీలు కుదరని పరిస్థితి. తినడానికి తిండి దొరకని దుస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పాలకులు పట్టించుకోలేదు. ఎలాంటి పదవులు లేని జనసైనికులు మరోసారి జనం కోసం నిలబడ్డారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. చాలా ఇళ్లు ఇంకా ముంపులోనే ఉండగా, నీళ్లలో తోపుడు బండ్ల మీద ఆహారం తీసుకువెళ్లి మరీ బాధితుల కడుపు నింపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-22-at-10.57.35-PM-968x1024.jpeg)