జనసేన లక్ష క్యాలెండర్ల పంపిణీకి సర్వం సిద్ధం.. మొదటి క్యాలెండర్ ను ఆవిష్కరించిన నాగబాబు

తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన పీఏసీ సభ్యులు, మెగా బ్రదర్ కొణిదల నాగబాబు ను.. రాజమండ్రి షెల్టన్ హోటల్ నందు.. నాయకులు, జనసైనికులతో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటి అయిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ.. అనంతరం పీఏసీ సభ్యులు నాగబాబు రాబోవు రోజుల్లో చేపట్టబోయే కార్యచరణను జనశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ ప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్ ను నాగబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఇతర పెద్దలు, నాయకులు, జనసైనికుల మధ్య ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ లో జనసేన పార్టీ తరపున చేపట్టిన కార్యక్రమాలను, భవిష్యత్తులో చేపట్టబోయే వివిధ కార్యక్రమాలతో కూడిన విషయాలు ముద్రించిన ఈ క్యాలెండర్ నియోజకవర్గంలో లక్షకు పైగా ప్రతి గడపకు అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పెద్దలు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.