జనసేన పల్లెబాటలో అడుగడుగున ప్రజాదరణ

ఎర్రగొండపాలెం నియోజకవర్గం, జనసేన-పల్లెబాట కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గౌతమ్ రాజ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పిలుపుమేరకు, జనసేన – పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గౌతమ్ రాజు ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రజలతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద దింపే దాకా ప్రతి ఒక్క జనసైనికుడు ప్రభుత్వంపై పోరాటం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు ఇంచార్జ్ గౌతమ్ రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ కె.చిన్న పాల్, జనసేన పార్టీ పెద్దారవీడు మండలం నాయకులు సందీప్, జెడ్డా రాజు, పోలెబోయిన శేషగిరి రావు, మెడతోటి వీర వెంకటేశ్వర్లు, కొదమల బాబు, పాపయ్య, సతీష్, వెంకటేశ్, రమేష్, యోహన్, ఆవులరాజు, శ్రీను, కాశయ్య, నాగయ్య, అల్లురయ్య పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.