డిజిటల్ క్యాంపెయిన్ చేసి జనసేన నాయకులు మనోజ్ కుమార్

జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ “విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు” అనే ప్లకార్డు పట్టుకుని నిరసన చేపట్టారు. “విశాఖ ఉక్కు” ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనసేన పార్టీ మూడు రోజుల పాటు “విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు” నినాదాన్ని డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్లమెంటు సభ్యులు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కాకుండా కాపాడాలి, ఆంధ్ర ఎంపీలు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి, ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితమే ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ, ఈ పరిశ్రమ ద్వారా లక్షలాది మంది కార్మికులు లబ్ది పొందుతున్నారు, వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జనసేన పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము అని మనోజ్ కుమార్ తెలిపారు.