పోతవరం గ్రామంలో మహా శివరాత్రి జాతరకు హాజరైన జనసేన నాయకులు

దర్శి నియోజకవర్గం, పోతవరం గ్రామమునందు మహా శివరాత్రి సందర్భంగా జాతర జరుగుతున్నది. ఆ జాతరకు దర్శి నియోజకవర్గం జనసేన ఇన్ ఛార్జ్ బొట్టుకు రమేష్ ఆహ్వానం మేరకు జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, మార్కాపురం జనసేన ఇన్ ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, ఒంగోలు జనసేన పట్టణ అధ్యక్షులు మాలాగ రమేష్, జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు, జనసేన ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బోందెల శ్రీదేవి జాతరకు హాజరై.. జనసైనికులు కట్టిన ప్రభను సందర్శించి జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.