చంద్రగిరి నియోజకవర్గంలో వరిదబాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన నాయకులు

చంద్రగిరి నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరదబాధితుల సహాయార్థం జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా నాయకులు పంపిన నిత్యావసర సరుకుల కిట్లను చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా. శ్రీ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో, దేవర మనోహర నేతృత్వంలో చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలోని పలు ముంపు ప్రాంతాల అయిన రాయలచెరువు, కాలేపల్లి, చిట్టతూరు మెదలగు గ్రామాల వరద బాధితుల సహాయార్థం సుమారు 200 పైచిలుకు కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. అలానే నష్టపోయిన రైతులను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకొని అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్య్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పడగాల మురళి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తెన మధు వివిధ మండల నాయకులు దండు లక్ష్మీపతి, యువకిషోర్, వెంకట్, రాయల్ వేణు గారు, సంజీవి హరి మరియు అమర్, రాకేష్ సాయిరాం లక్ష్మణ్, మంజుల, రెడ్డప్ప, ప్రతాప్, సాయి, సింగిరి ధనుష్, కిరణ్, జనార్ధన్ పాల్గొన్నారు.