జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుని కుటుంబానికి సానుభూతి తెలిపిన జనసేన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం రూరల్, ద్రాక్షారామం గ్రామం సాక్షివారి వీధి జనసేన పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు జనసేన నాయకులు ఆళ్ళ రామం స్వర్గస్తులైనారు. వారి కుమారుడు ఆళ్ళ రమేష్ ని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ కలసి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు బుంగా రాజు, సంపతి సత్యనారాయణ మూర్తి, రూరల్ మండలం వైస్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీను, వీరు బండి, కర్రా నాగేశ్వరరావు, తోట రామకృష్ణ, బోనం శ్రీను, రాంబాబు నాయుడు తదితర ద్రాక్షారామం గ్రామం జనసైనికులు వెళ్లి పరామర్శించడం జరిగింది.