ఏలేరు రిజర్వాయర్ ను పరిశీలించిన జనసేన నాయకులు

ప్రత్తిపాడు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేరు రిజర్వాయర్ కాలువ పనులకు వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగా ఆధునికరణ పనులు ఆగిపోవటం జరుగుతుంది. వ్యవసాయం పనులకు ఇబ్బందిగా వుంది. కావున రిజర్వాయర్ మరియు విద్యుత్ ప్లాంట్ ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల రామ మోహన రావు (గాంధి), ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపు తమయ్య బాబు సందర్శించి, పరిశీలించారు.