నర్సంపేట నూతన ఏసీపీ ని కలిసిన జనసేన నాయకులు

వరంగల్, నర్సంపేట నూతన ఏసీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఏ సంపత్ రావు ని జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ నాయకులు గౌరవపూర్వకంగా కలిసి పూలబొకే అందించి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్ మాట్లాడుతూ ప్రజల శాంతి, భద్రతల పరిరక్షణకై పోలీసు వారు అందిస్తున్న సేవలలో జనసేన పార్టీ తమవంతు సహకారం అందిస్తుందని, అలాగే జనసేన పార్టీ దృష్టికి వచ్చే ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు వారు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ సందర్భంగా గతంలో ఏసీపీగా పనిచేసి నర్సంపేట ప్రజానీకానికి అమూల్యమైన, విశేష సేవలు అందించిన “ఫణింధర్” కి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నూతన ఏసీపీ కలిసిన వారిలో యువజన నాయకులు వంగ మధు, ఓర్సు రాజేందర్, రాపోలు సురేష్, ఎలబోయిన డేవిడ్ రాజు, ఇరుసం యాకూబ్, గంగుల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.