సాగర్ ను మర్యాదపూర్వకంగా కలసిన జనసేన నాయకులు

కరీంనగర్: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, సిని నటుడు (ఆర్ కే నాయుడు) సాగర్ ను వారి స్వగ్రామం గోదావరిఖని గృహాము నందు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి రామగుండం నియోజకవర్గ నాయకులతో స్వాగతం తెలియజెసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షులు రావుల మధు. రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరుపున చేసిన కార్యక్రమాలు అడిగి తెలుసు కున్నారు. భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళిక సిద్దం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేదాం అని చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న ప్రతి జనసైనికున్ని కలిసి మాట్లాడుతా జనసైనికులలో ఉత్తేజం నింపే కార్యక్రమంతో ముందుకు వెళ్దాం అని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మంథని శ్రవణ్, ఏముర్ల రంజిత్, మోతె రవికాంత్, రాజశేఖర్, బండారు తిరుప్పతి, లోకేష్, సంతోష్, నరెష్, సాయి, ఈశ్వర్, మనోజ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.