చిల్లపల్లి నాగేశ్వరరావుకు అశ్రునివాళి అర్పించిన జనసేన నాయకులు

జనసేన పార్టీ చేనేత వికాసం విభాగం చైర్మన్, మంగళగిరి ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు తండ్రి గారైన ప్రముఖ పారిశ్రామికవేత్త చేనేత నాయకుడు చిల్లపల్లి నాగేశ్వరరావు మృతిచెందడం బాధాకరం.. ఆయన మృతి చేనేత పరిశ్రమకు, ఆయన కుటుంబానికి తీరని లోటని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్డాణం మార్కండేయ బాబు, అన్నారు… మంగళవారం మంగళగిరిలో ఆయన నివాసంలో చిల్లపల్లి నాగేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చింతా రేణుకారాజు కూడా నివాళులర్పించారు..

చేనేత పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన చిల్లపల్లి నాగేశ్వరరావు .. చేనేత పరిశ్రమఅభివృద్ధికి విశేష సేవలందించారు.

చిల్లపల్లి నాగేశ్వరరావు మృతికి అశ్రునివాళి అర్పిస్తూ .. వారి ఆత్మకు సద్ఘతి ప్రాప్తించాలని చాలని జనసేన నాయకులు దేవుణ్ణి కోరుకున్నారు.