నిరుపేద వృద్ధునికి నివాళులర్పించిన జనసేన నాయకులు

తంబళ్లపల్లి నియోజకవర్గం, ములకలచెరువు మండలం, చౌడ సముద్రం గ్రామంలోని ఎస్సీ కాలనీలో దళిత నిరుపేద దంపతులు జీవించేవారు. వీరి వయసు దాదాపు 70 సంవత్సరాలు. అ దంపతులలో భర్త అనారోగ్యంతో సోమవారం మరణించడం జరిగింది. వీరి కుటుంబానికి దాదాపుగా 5 నెలలుగా జనసేన పార్టీ నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఆయన మరణించిన విషయం తెలుసుకున్న మండల అధ్యక్షులు పోతుల సాయినాథ్ మరొకసారి అంతిమ సంస్కారానికి ఆర్థిక సాయం చేసి ఆయన దాతృత్వాన్ని నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమంలో పవర్ ఆఫ్ ద టీమ్ అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, ఎమ్మార్పిఎస్ నాయకులు తిరుపాలు, శివ శివకుమార్ పాల్గొనడం జరిగింది.