కుమ్మరి వీధుల్లో పర్యటించిన శ్రీమతి కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, లావేరు పంచాయతీలో జనసేనపార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు కాంతిశ్రీ కుమ్మరి కళాకారుల వీధుల్లో పర్యటించి వారు సమస్యలు తెలుసుకోవటం జరిగింది. అలాగే కుమ్మరి వృత్తి కళాకారులు మాట్లాడుతూ గతంలో నాయకులు ఎలక్షన్ ముందు వచ్చి మా వీధుల్లో, రోడ్డు కాలువ వీధి దీపాల కాలువ పూడికలు, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, మూడు సంవత్సరాలు దాటిందని ఇప్పటి చేయలేదని తెలిపారు. మా కుల వృత్తి మాతోనే అంతరించి పోతుందని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పుడు మార్కెట్ లో పింగాణీ, మాగాణి, సిమెంట్ తో తయారైన వస్తువులు ప్రజలు అధికంగా వాడుతున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ వృత్తిలో ఆదాయం రాక పూట గడవటానికి ఇబ్బంది పడుతున్నామని, మా పిల్లులు కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఖాళీగా ఉంటున్నారని వారి బాధను తెలియజేసారు. ఈ సందర్భంగా కాంతిశ్రీ మాట్లాడుతూ మీ యొక్క సమస్యలు అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, మీకు నూతన సాంకేతిక పరిజ్ఞాన పరికరాలు చూపించే విధంగా, పవన్ కళ్యాణ్ అంతరించిపోతున్న కళను వెలికితీసి ప్రోత్సహించే విధంగా చేస్తారని, తెలిపి వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి ఒక్క అవకాశం ఇవ్వమని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో లావేరు నాయకులు దొర రాజారమేష్, బార్నాల దుర్గారావు, కోలారాజేశ్, గొర్లె సూర్యనారాయణ కొమ్మూరు శ్రీను, చిన్ని, కొంపెళ్ళ పవన్, అవినాస్, పవన్ మరియు గ్రామ జనసైనికులు, ప్రజలు పాల్గొన్నారు.