వంగవీటికి నివాళులు అర్పించిన జనసేన నాయకులు

విజయవాడ సెంట్రల్: జనసేన పార్టీ విజయవాడ అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆదేశాల మేరకు, డివిజన్ అధ్యక్షులు రాము గుప్తా ఆధ్వర్యంలో జనసేన పార్టీ స్థానిక 37వ డివిజన్ లో సోమవారం చౌక్ సెంటర్ లో పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమంను నిర్వహించి కార్యక్రమంలో భాగంగా రంగాకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చల్ల ఏసుబాబు, కిలాని రాము యాదవ్, రమేష్ , రవి, జాగ్ సూరిబాబు, బీసీ నాయకులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర బీసీ నాయకులు మరియు న్యాయవాది హనుమాను, జనసేన పార్టీ నాయకులు పెట్టేటి నాంచారయ్య పాల్గొన్నారు.