క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ చెక్ అందించిన జనసేన నాయకులు

నరసరావుపేట నియోజకవర్గం, కాకాని గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త అడపాల మహేష్ కు ఇటీవల అనుకోని పరిస్థితుల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయం తెలుసుకొన్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పూర్తి సమాచారాన్ని కేంద్ర కార్యాలయానికి పంపగా, క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్న జనసైనికుడు మహేష్ కు తక్షణం ఆర్ధిక సహాయంగా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 50 వేల రూపాయల చెక్కుని జిల్లా అధ్యక్షులు వారికి పంపించడం జరిగింది. మంగళవారం ప్రమాదానికి గురైన అడపాల మహేష్ ఇంటికి జనసేన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిలాని, కమాల్, మార్కండేయ బాబు, బండారు రవి కాంత్, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, అద్దేపల్లి ఆనంద్, బెల్లంకొండ ఈశ్వర్, మండల అధ్యక్షులు గోవింద్, సాంబశివరావు నరసరావుపేట నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.