హెచ్.బి కాలనీలో పర్యటించిన జనసేన నాయకులు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ కో-ఆర్డినేటర్ తిరుపతి సురేష్ ఆధ్వర్యంలో సోమవారం 42వ డివిజన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ మరియు 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష హెచ్.బి కాలనీ 450, 350 ఎస్.ఎఫ్.టి బ్లాక్ లలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పోతిన వెంకట మహేష్ హామీ ఇస్తూ, ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. అనేక రకాల పన్నులు విధిస్తూ, అభివృద్ధి అనేది లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని దించి జనసేన టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తిరుపతి అనూష మాట్లాడుతూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గనుక వస్తే మన ఆస్తుల పేపర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుని వాటిని తాకట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుందని ఎద్దెవా చేశారు. వైసీపీ వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.డి ఆయాజ్, దాసి రామ్మోహన్, ఎం.డి ఫయాజ్, ఎస్.కె అల్లా బక్షు, నజీర్, ఆదిత్య రెడ్డి, పసుపులేటి నాగకృష్ణ, మహేశ్వరి, రెడ్డిపల్లి శ్యామ్, శివాజీ ముదిరాజ్, కరిముల్లా, రహిమాన్, కానాల వినోద్ కుమార్, వెంకట్రావు, దాసరి మూర్తి రాజు, తులసి మురళి, తంగా రవి మరియు జనసేన పార్టీ నాయకులు బొమ్ము రాంబాబు, కూరాకుల సురేష్, జెల్లీ రమేష్, శనివారపు శివ, పైలా పవన్, బొట్ట సాయి, సుకాశి భాను ప్రకాష్, పులి చేరి రమేష్, సోమి గోవింద్, తోత్తడి భారత్ బంది చోడే శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.