జనసైనికుని కుటుంబానికి భరోసా ఇచ్చిన ఆమదాలవలస జనసేన

ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి గ్రామానికి చెందిన జనసైనికుడు కేత పృధ్వీరాజ్ అనే విద్యార్థి సంక్రాంతి రోజు యాక్సిడెంట్ లో ప్రమాద శాత్తు మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి సోమవారం జనసేన పార్టీ తరఫున 6000 రూపాయలు అందజేయడం జరిగింది మరియు ఆ కుటుంబానికి అన్నివేళలా జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి మండల జడ్పిటిసి అభ్యర్థి పైడి మురళీమోహన్, బాబాజీ కాకర్ల, కోరుకొండ మల్లేశ్వరరావు, కొల్ల జయరాం, దవలీ రాజేష్, దాసరి సురేష్, జోగి చందు మరియు సరుబుజ్జిలి మండలం జనసైనికులు పాల్గొన్నారు.