కొల్లు ఆంజనేయులును పరామర్శించిన జనసేన నాయకులు
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, కరవాక గ్రామానికి చెందిన జనసేన నాయకులు కొల్లు శ్రీనుబాబు తండ్రి ఆంజనేయులు అనారోగ్యంతో అస్వస్థతకు గురవడం జరిగింది. గురువారం వారి కుటుంబ సభ్యులను కలసి ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితిని, యోగ క్షేమాలను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు, అంతర్వేది దేవస్థానం ఎంపిటిసి బైరా నాగరాజు, మణికంఠ, స్వామి తదితరులు అడిగి తెలుసుకోవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-07-at-19.56.20-1024x470.jpeg)