జనసేన నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
నంద్యాలలో అంగన్వాడీలు తమ సమస్యలను తీర్చాలని, వేతనాలను పెంచాలంటూ చలో విజయవాడ కార్యక్రమం పిలుపునిచ్చారు. అందులో భాగంగా జనసేన నాయకులు వారికి మద్దతు తెలుపుతారని నేపంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి నంద్యాల ఇంఛార్జ్ జనసేన నాయకుడు పిడతలసుధాకర్ వారి అనుచరులు సందీప్, షబ్బీర్ లను స్థానికంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసి ఉంచారు. రాత్రి వేళల్లో అంగన్వాడి కార్యకర్తలను మహిళలని చూడకుండా అరెస్టు చేసి స్టేషన్లో ఉంచడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రాక్షస పాలనను అంత మోదించాలని రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ పవన్ కళ్యాణ్ కి ఓటువేసి గెలిపించాలని కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-25-at-12.18.00-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-25-at-12.17.59-PM-1024x768.jpeg)