స్వాములకు భోజనం ఏర్పాట్లు చేసిన జనసేన నాయకులు

పోలవరం: కన్నాపురం నుంచి భద్రాచలం రాములవారి ఆలయానికి కాలినడకన సుమారు 300 మంది స్వాములు శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీలుగుమిల్లిలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు పసుపులేటి రాము మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లుచెయ్యడం జరిగింది. గురుస్వామి రామాంజనేయులు, తెలగారాపు బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పవిత్ర కార్యానికి చేసిన సహాయం ఎంతో గొప్పదని, పవన్ కళ్యాణ్ సీఎం, చిర్రి బాలరాజు ఎమ్మెల్యే అయ్యేవరకు జట్టు గెడ్డం తియ్యనని ఆయన శ్రీరామ ప్రభువులకు మొక్కుకున్నానని కొమ్ముగూడెం చెందిన తెలగారపు బాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూపా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.