వర్షానికి గుంతలు పడ్డ రోడ్డును పూడ్చిన జనసేన నాయకులు

*వర్షానికి గుంతలు పడ్డ రోడ్డు ను పూడ్చిన జనసేన పార్టీ యువజన సంఘం నాయకులు

గత కొద్ది రోజుల క్రితం ఎడతెరపి లేని వర్షం వల్ల రోడ్లు మొత్తం నాశనం అయ్యాయి. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణం లోని రాహుల్ నగర్ లో వర్షం వల్ల రోడ్డు బురద మయంగా మారింది. అక్కడి నుండి నడవడానికి, చిన్న పిల్లలకు, వృద్దులకు, వాహనాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలిగింది. ఇది గమనించిన అదే కాలనికి చెందిన జనసేన యువజన నాయకుడు అర్జున్ వెంటనే స్పందించి తన సొంత ఖర్చులతో ట్రాక్టర్ ద్వారా మట్టిని తెప్పించి రోడ్డును బాగు చేయించాడు. దీని వల్ల ఆ కాలనికి చెందిన ప్రజలు చాలా సంతోష పడి అతన్ని మెచ్చుకున్నారు. ఈ సందర్బంగా అర్జున్ మాత్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఆయన ఆలోచన విధానం ప్రజల కోసం పడే తపనే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అని.. ప్రజా సమస్యల కోసం పని చేస్తూ నిరంతరం పార్టీనీ బలోపేతం చేయడానికి ప్రజల్లో కృషి చేస్తానని చెప్పడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, జనసేన యువజన విభాగం నాయకులు, అర్జున్, సందీప్, మయూర్, లక్ష్మణ్, గంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.