ప్రభుత్వాధికారులను నిలదీసిన జనసేన నాయకులు

ఎచ్చెర్ల, జి.సిగడాం మండలం నిద్దాం పంచాయతీ అద్దోనం పేట రోడ్డు విషయంలో వేసిన గ్రావెల్ గవర్నమెంట్ స్థలం నుంచి తీయడం జరిగిందని, దీనికి మండల రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఇచ్చారా? వీళ్ళకి తీయడానికి గల అధికారాలు ఏమి ఉన్నాయని? ఆమదాలవలస నియోజకవర్గం ఇన్చార్జ్ అభ్యర్థి పేడాడ రామ్మోహన్ అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అర్జున్ భూపతి మండల జనసైనికులు తదితరులు ఎమ్మార్వో ఆఫీస్ నందు ఎమ్మార్వో ని, ఆర్ ఐ ని అందరిని కూడా నిలదీయడం జరిగింది.