వృద్ధాశ్రమంలో పండ్లు పంచిన జనసేన నాయకులు

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాలగోపాల లక్ష్మీ నరసమ్మ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి 25 మంది వృద్ధులకు పాలకొండ జనసేన యువనాయకులు షేక్ అజార్ మూడు రకాల పండ్లు ఆపిల్, దానిమ్మ, అరటి పళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే జామి అనిల్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఏ ఒక్కరూ కుడా అనాధగా ఉండటానికి వీలులేని సమ సమాజాన్ని స్థాపించడం కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడం జరిగింది. కావునా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ పట్టణ జనసేన పార్టీ సీనియర్ నాయుకులు పోరాడి ప్రశాంత్ కుమార్, పొట్నూరు రమేష్ కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.