జనసైనికుడు పవన్ కు మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

పుంగనూరు, అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడు సవరం పవన్ తండ్రి గోవింద్ కు గురువారం పుంగనూరు జనసేన నాయకులు చేయూతనందించారు. ఆపదలో ఉన్న జనసైనికుడు పవన్ కు జనసేన నాయకులు అండగా ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చి 32000/- ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ ఆవుల చైతన్య రాయల్, పుంగనూరు టౌన్ ప్రసిడెంట్ గాజుల నరేష్ రాయల్, నాయకులు పసుపులేటి విజయ్, శ్రావణ్ రాయల్, రాయల్ కుమార్, మోహన్ రాయల్, సురేష్ రాయల్ లు పాల్గొన్నారు.