వంశీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బిజెపి, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపధ్యంలో మంగళవారం ఉదయం జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డిని వారి బిజెపి కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పార్టీ కార్యకర్తలతో మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా మాకు శిరోధార్యమే.. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాలపై దాడులు, అన్నదాతలకు ధాన్యం గిట్టుబాటు ధరల ఇవ్వలేని వంటి అనేక ప్రభుత్వ వైఫల్యాల ఎత్తి చూపుతూ చేసిన పోరాటాలు, నిరసనలు, పెట్టించుకున్న కేసులు, వృధా కాలేదని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. జనసేన బిజెపి తెలెగుదేశం పార్టీలు కలసి పని చేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన బిజెపి నాయకులను సురేందర్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, ఎర్రబోలు రాజేష్, భరత్ కుమార్, విజయ్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుదీర్, నగర కార్యదర్శి కృష్ణవేణి, హేమచంద్ర యాదవ్, జనసేన నాయకులు శీను, వెంకీ, కేశవ, బన్నీ, ఇశాఖ్, రామాంజనేయులు, హసీనా తదితరులు పాల్గొన్నారు.