ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

వైజాగ్: 67వ వార్డు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఆదివారం ఒటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.ఎల్.ఓ లతోపాటు జనసేన పార్టీ తరఫునుంచి కూడా పాల్గొని బి.ఎల్.ఓ కి సపోర్టుగా నిలిచి ఈ కార్యక్రమాన్ని 66వ వార్డు 67వ నుంచి కొంతమంది కొత్త వాటర్ ని చేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 66వ వార్డు నుంచి జనసేన పార్టీ మహిళా అధ్యక్షురాలు లంక లత, అబ్దుల్ ఖాదర్ జిలాని, 67వ వార్ నుంచి గోరుపుశెట్టి శ్రీను, రౌతు భాస్కర్, దొడ్డి పరశురాం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.