చక్రద్వారబంధం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • పూలమాలతో, హారతులతో బత్తుల బలరామకృష్ణ కుమార్తె శ్రీమతి ప్రత్యూష దేవికి బ్రహ్మరధం పట్టిన గ్రామ ప్రజానీకం
  • శ్రీమతి ప్రత్యూష దేవికి అడుగడుగునా హారతులు, తీన్మార్ డప్పులతో ఘన స్వాగతం
  • జై జనసేన నినాదాలతో మార్మోగిన చక్రద్వారబంధం వీధులు, రోడ్లు

రాజానగరం: జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా బుధవారం రాజానగరం మండలం, చక్రద్వారబంధం గ్రామంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కుమార్తె శ్రీమతి తోట ప్రత్యూష దేవి పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా గ్రామంలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుండి పాదయాత్రగా గ్రామంలో ప్రతీ ఇంటికీ, ప్రతీ గడపకూ వెళుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, పోకెట్ బ్యాడ్జ్, బొట్టు బిల్ల ప్యాకెట్ అందచేశారు. ఈ సందర్భంగా ప్రత్యూష దేవి మాట్లాడుతూ ఈ అవినీతి పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. గ్రామాల్లో రోడ్ల దుస్థితి చాలా అద్వానంగా ఉందని.. అధికార పార్టీ దుర్మార్గాలకు, దౌర్జన్యాలతో ప్రజలు విసుగుచెందారని.. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, చక్రద్వారబంధం గ్రామ ప్రజలు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.