స్వర్ణవారి గూడెం గ్రామంలో ఇంటింటికి జనసేన

పోలవరం, జీలుగుమిల్లి మండలం స్వర్ణవారి గూడెం గ్రామం పంచాయతీ పరిధిలో ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా పోలవరం జనసేన ఇంచార్జ్ చిర్రి బాలరాజు, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో మరియు స్వర్ణవారి గూడెం గ్రామంలో తుమ్మనేని వెంకటరత్నం ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువత జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయరు. వారి పరిపాలన ప్రస్తుత అధికార ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నెగ్గి పోలవరం నియోజకవర్గాన్ని ఆమడదూరం పెట్టడంతో మహిళలు యువత ఆవేదన వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ చిర్రి బాలరాజు నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడపగలరని తుమ్మనేని వెంకటరత్నం అన్నారు. ఈ స్వర్ణవారిగూడెం పంచాయితీలో అన్ని గ్రామాలలో పర్యటించి జనసేన పార్టీకి అండగా పవన్ కళ్యాణ్ కి చిర్రి బాలరాజు గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎక్స్-జడ్పీటీసీ గడ్డమనుగు రవి కుమార్ సభ్యులు మాట్లాడుతూ మండలానికి పూర్వ వైభవం తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.