గాడాల గ్రామంలో జనంకోసం జనసేన మహాపాదయాత్ర
రాజానగరం, కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికుల కోలాహలం నడుమ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ చేపట్టిన జనంకోసం జనసేన మహాపాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా బత్తుల బలరామకృష్ణ ప్రజలతో మమేకమవుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉంది, రోడ్లు అసలే లేవు, నడవడానికి సరైన దారి లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మురుగుకాలువ నీళ్లు వెళ్ళుటకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం వలన రోడ్లపైకి చేరుతుందని దీని వలన భరించలేని దుర్గందంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చిన్న పిల్లలు నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు అనారోగ్యం బారినపడుతున్నారని తెలియజేసారు. ఈ ప్రాంతంలో మేం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రోడ్ల సమస్య మరియు డ్రైనేజీ వ్యవస్థ అని, మేము వాడిన వాటర్ బయటికి వెళ్లే దారి లేదు అని స్థానిక ప్రజలు బత్తుల బలరామకృష్ణకి తమ బాధను విన్నవించడం జరిగింది. మమ్మల్ని పట్టించుకునే నాధులే లేరు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన కంప్లైంట్ కి ఎవరు రెస్పాండ్ కారు మేము చెప్పి చెప్పి విసిగి పోవడం జరిగింది అనే స్థానికులు వాపోయారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నేను అధికారులతో మాట్లాడి తొందర్లోనే మీ సమస్య తీరేలా చూస్తానని లేనిపక్షంలో రాబోయే ఎలక్షన్లలో మీరు కచ్చితంగా జనసేన పార్టీనీ గెలిపించాలని అనంతరం గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-22.52.10-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-22.52.09-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-22.52.06-1024x576.jpeg)