కోరుకొండలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం, జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తె తోట ప్రత్యూష దేవిలకు గురువారం గ్రామ ప్రజలు హారతులతో స్వాగతం పలకడం జరిగింది. కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి పాదయాత్రగా గ్రామంలో ప్రతీ ఇంటికీ, ప్రతీ గడపకూ వెళుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, పాకెట్ బ్యాడ్జ్, బొట్టు బిల్ల ప్యాకెట్ జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు వీరమహిళ సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి తోట ప్రత్యూష దేవి అందజేయడం జరిగింది. వీరమహిళలు, జనసేన కార్యకర్తలు, యువత ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు.