రఘుదేవపురంలో ఉదృతంగా సాగిన జనం కోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం నియోజకవర్గం: జనంకోసం జనసేన మహా పాదయాత్రలో భాగంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తెలు శ్రీమతి ప్రత్యూష దేవి, బత్తుల వందనాంబిక రఘుదేవపురం గ్రామంలో పర్యటించారు. వీరికి గ్రామంలోని ప్రజలు అడుగడుగునా హారతులు పడుతూ, పూల వర్షాలతో ఘనస్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో ఈ ఐదు సంవత్సరాలలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి చేసిన దుర్మార్గాలను కథలు కథలుగా చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రఘుదేవపురం గ్రామంలో గడపగడపకు వెళుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఆవశ్యకతను వివరించడం జరిగింది. యువతకు పెడదోవ పట్టిస్తున్న నాయకులకు గుణపాఠం నేర్పుతామని తెలిపారు. జనం గురి అంతా బత్తుల వైపు ఉండడం వారి సిద్ధాంతాల పట్ల ఆకర్షింపబడటం వల్ల గ్రామం మొత్తం బత్తుల కుటుంబ సభ్యుల మహాపాదయాత్రను దిగ్విజయం చేస్తూ జై బత్తుల జై జనసేన జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.