జనసేన ఎంపీటీసీ శ్రీమతి దూలపల్లి రత్నం భర్త అన్నవరంను పరామర్శించిన ఊట ఆదివిష్ణు దంపతులు

పిఠాపురం నియోజకవర్గం, చిత్రాడ గ్రామానికి చెందిన జనసేన ఎంపిటిసి శ్రీమతి దూలపల్లి రత్నం భర్త అన్నవరం హార్ట్ స్టోక్ రావడంతో కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ నందు స్టంట్ వేయించుకోవడం జరిగినది. రత్నం కుటుంబాన్ని పరామర్శించేందుకు అన్నవరం ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వారి స్వగృహానికి శుక్రవారం నియోజకవర్గ జనసేన నాయకులు ఊట ఆదివిష్ణు (నాని బాబు), జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష, రావడం జరిగినది. అన్నవరం ఆరోగ్య స్థితి గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్న నాని బాబు ఏ అవసరం ఉన్నా ఏ పరిస్థితులైన తనను తమ కుటుంబంలో ఒక సభ్యునిగా భావించి నిర్మొహమాటంగా ఫోన్ చేయవలసిందిగా చెప్పారు. అధికార ప్రతినిధి శిరీష ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి రీత్యా ఇంత ఇబ్బంది ఉన్నా తనకు ఆ విషయం తెలపకుండా అధికార పార్టీ అకృత్యాలను ఖండిస్తూ తాను పట్టణం నందు పెట్టిన ప్రెస్ మీట్ కి రత్నం వచ్చి జనసేన పార్టీ ప్రజాప్రతినిధిగా తన నిబద్ధత చాటిన తీరు ఒకపక్క విస్మయానికి గురి చేస్తున్నా మరొక పక్క చాలా గర్వంగా కూడా ఉందని, చిత్రాడ జనసైనికులు రత్నం గెలుపుకై పడిన కష్టానికి న్యాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంజి గోవిందరాజు, పేర్నీడి చక్ర నారాయణ, ఊట సురేష్, తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.