చెల్లూరు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన ఎంపీటీసీ

మండపేట, చెల్లూరు ఎంపీటీసీ-1 గొల్లపల్లి అనూరాధ మాట్లాడుతూ 97 ఓట్ల మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపించి నేటికి ఒక సంవత్సరం అయ్యింది. మనందరి అభిమాన నాయకుడు మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ వేగుళ్ళ లీలాకృష్ణ ఆశీస్సులతో చెల్లూరు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో జనసేన పార్టీ ఎంపీటీసీను గెలిపించి భాద్యతలు అప్పగించిన చెల్లూరు ఓటరులకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నామినేషన్ వేసిన దగ్గర నుండి నా వెన్నంటే ఉండి నా గెలుపుకు అహర్నిశలు శ్రమించి నాకు సహకరించి తన శక్తికి మించి పోరాడిన నా తమ్ముడు కీర్తి శేషులు బండి రాముకి, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలకు మరియు బంధుమిత్రులు అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరకాలంలో ఎంతో బాధ్యతగా పనిచేస్తూ ప్రజల అవసరాలు తీర్చడానికి ఎన్నో సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళుతూ, మండల పరిషత్ సమావేశాలలో ప్రజల సమస్యలు సభ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది, గ్రామ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చి ప్రజా అవసరాలు తీర్చడానికి నా వంతు కృషి చేయడం జరిగింది. కానీ చాలా సమస్యలు పరిష్కరించవలసి ఉంది, రాబోవు కాలంలో మన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మండపేట నియోజకవర్గ ఇంచార్జి వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో వారి అడుగు జాడలలో అవినీతికి పాల్పడకుండా, ప్రలోభాలకు లొంగకుండా, ప్రజలు ఇచ్చిన ఈ పదవిని పదవిలా కాకుండా మరింత బాధ్యతగా భావించి ప్రజా అవసరాలు తీర్చడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేస్తూ… రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా మరియు లీలాకృష్ణని మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు.