మానవత్వం చాటిన జనసేన

హుకుంపేట మండలం, పాతకోట పంచాయతీ, పనసపుట్టు గ్రామంలో శొనభ పవన్ దినకార్యం సందర్భంగా వారి కుటుంబానికి అండగా జనసేన పార్టీ తరుపున సహాయంగా బియ్యం బస్తా, కందిపప్పు, మంచినూనె, ఫోటో కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు కోటేశ్వరరావు పడాల్ బలిజ, నాగరాజు బూడిద, సురకత్తి రాంబాబు, ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు పరదాని సురేష్, వంతాల మోహన్, దుడ్డు శోభన్ బాబు,శొనభ సునీల్, శొనభ శివకుమార్, పెనుమల సాయికార్తిక్ పాల్గొన్నారు. బియ్యం బస్తా అందించిన శెట్టి ఆనంద్ మరియు శ్రీనివాస్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.