జనసేన పిఏసి సభ్యులు నాగబాబుని కలసిన క్రియాశీలక సభ్యులు

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి విచ్చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యులు కొణిదల నాగబాబుని స్ధానిక షెల్టాన్ హోటల్ లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరెషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలో వివిధ వార్డుల్లో ఉన్న పార్టీ క్రియాశీలక సభ్యులు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. నగరంలో వేలాది మంది వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవటం విధితమే, ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ నగరంలో పార్టీని బలోపేతం దిశగా తీసుకువెళ్ళాలని, నగర అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాలని తెలియజేసారు. వై.శ్రీనివాస్ క్రియాశీలక సభ్యులను నాగబాబుకు పరిచయం చేసారు. వై.శ్రీనివాస్ మరియు క్రియాశీలక సభ్యులు నాగబాబుకి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో కూడిన ఫొటో ఫ్రేమ్ అందజేసి సత్కరించారు. ఈ సమావేశంలో భారీ సంఖ్యలో క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.