మత్స్యకారుల అభివృద్దే ధ్యేయంగా జనసేన పాదయాత్ర

తాళ్లరేవు, మత్స్యకారుల హక్కుల సాధన, సమస్యల గుర్తింపు వాటి పరిష్కారానికి ఈ నెల 14న చేపట్టే మత్స్యకారుల అభ్యున్నతి పాదయాత్ర యాత్రను విజయ వంతం చేయాలని జనసేన నియోజకవర్గ సమస్వయకర్త పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. తాళ్లరేవు మండలం జి. వేమవరంలో సర్పంచి పుణ్యమంతుల సూరిబాబు ఆదివారం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు, మత్స్యకార నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… జనసేన రాష్ట్ర పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలం చొల్లంగి, చొల్లంగిపేట, కొత్తూరు మహాలక్ష్మమ్మ ఆలయ ప్రాంతాల్లో ఈ పాదయాత్ర జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సానబోయిన మల్లికార్జునరావు, నాయకులు అత్తిలి బాబూరావు తదితరులు హాజరయ్యారు.