జనసేన పార్టీ ఇఫ్తార్ విందు

చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా.. పసుపులేటి హరి ప్రసాద్ సూచనల మేరకు.. జనసేన పార్టీ సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళ్లెం మండలంలో.. మండల అధ్యక్షులు చిరంజీవి యాదవ్ సమక్షంలో బసివి రెడ్డి కులాశేఖర్ రెడ్డి అధ్యక్షతన రంజాన్ సందర్బంగా మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి యాదవ్ మరియు కులాశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ముస్లిమ్ సోదరులు పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసంలో నిష్ఠతో ఉపవాసం ఉండి నిత్యం ఆ అల్లాని తలుచుకుంటూ అందరికి మంచి జరగాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వరదయ్య పాళ్లెం మండలం కమిటీ సభ్యులు, ఉప అధ్యక్షులు దినేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి శేఖర్ మరియు రెహ్మాన్, ఫాజులర్ ముల్లంగ్, వెంకటేష్, నాగేంద్ర బాబు, నాగేంద్ర, ముని, కృష్ణ, తులసి రామ్, జయకృష్ణ, శేఖర్ మరియు కాపు సంక్షేమసేన మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.