రైతు దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ

నిర్మల్ జిల్లా, తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ, భైంసా మండలం, కోతల్ గ్రామానికి చెందిన రైతు ఆనంద్ భోతే ఎమ్మార్వో కార్యాలయం ముందర రిలే నిరాహారదీక్ష చేపట్టాడు. ఆ రైతు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మద్దతుగా సుంకెట మహేష్ బాబు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు రైతు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. రైతు సమస్య పరిష్కారం అయ్యేవరకు జనసేన మద్దతు ఉంటాదని మహేష్ బాబు తెలిపారు.