జనసేన పార్టీ కాకినాడ సిటి పత్రికా విలేఖరుల సమావేశం

కాకినాడ: బుధవారం జనసేన పార్టీ కాకినాడ సిటి పత్రికా విలేఖరుల సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు, కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ స్థానిక శాశనసభ్యుడు నేడు పత్రికాసమావేశంలో మాట్లాడినది వింతగా ఉందనీ, సహజంగా మనుషుల యొక్క వ్యక్తిగత అభిప్రాయాలని పత్రికావిలేఖరుల సమావేశం పెట్టి చెప్పడం కొత్తగా వింటున్నామని, ఐనా ఆయన వద్ద నుండి తెలుసుకొవాల్సిన అవసరం జనసైనికులకు లేదన్నారు. ఒక నాయకుడైన, రాజకీయ నాయకుడైనా ఎలా ఉండాలి అన్నదానికి నిలువెత్తు స్పూర్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. వస్తూనే అధికారమే పరమావధి కాదని చెపుతు రాగల 25 సంవత్సరాలు పోరాటాలు చేయడానికి సిద్ధపడి వచ్చా అని చాటిచెప్పిన వ్యక్తిత్వం ఆయనిదన్నారు. ఎదురైన అపజయాలకు క్రుంగిపోకుండా తట్టుకుని పార్టీని ప్రజలకు చేరువ చేస్తూ నిలబడిన మనిషి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన గురించి మీదగ్గర తెలుసుకునే దుస్థితి రాష్ట్రంలో ఏ జనసైనికుడికీ లేదని అన్నారు. రాజకీయాలలో వివిధ పార్టీల నాయకులను కలవడం వ్యూహాలలో భాగమని , మీ నాయకుడు కలిస్తే అది మంచికారణం అంటూ వేరే వాళ్ళు కలిస్తే పెడబొబ్బలు పెట్టడం ఎందుకో చెప్పాలని డిమాండ్ చేసారు. రాగల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం చేపట్టడం ఖాయమన్నారు. రాజకీయాలలో హుందాతనాన్ని కొనసాగించేలా ఉండాలి తప్పితే రెచగొట్టెలా ఉండద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో కాకినాడ సిటి జనసేన పార్టీ అధ్యక్షుడు సంగిసెట్టి అశోక్, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, సిటి పార్టీ నాయకులు శ్రీమన్నారాయణ, సుంకర సురేష్, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.