క్యాన్సర్ బాధితుడికి జనసేన పార్టీ కువైట్ ఆర్ధిక సాయం

రాజంపేట: తాము నమ్మిన అధినాయకుడు పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తూ,
కష్టం ఎక్కడుంటుందో అక్కడ జనసేన పార్టీ ఉంటుందన్న ఆయన మాటను నిజం చేసి మరోక సారి నిరూపించి చూపించింది జనసేన పార్టీ కువైట్. సిద్ధవటం మండలంలో గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీరాములు అనే వ్యక్తి ని సోషల్ మీడియా ద్వారా సిద్దవటం జనసైనికుడు పసుపులేటి కళ్యాణ్ ద్వారా తెలుసుకున్న
జనసేన పార్టీ కువైట్ సభ్యులు అలి.షేక్ తన తోటి సభ్యులైన కుంచాశివశంకర్, యర్రంశెట్టిహరిబాబు, జిలాన్, కొట్టేశ్రీహరి, బల్లేపల్లి శ్రీనివాస్ రాయల్, గంగారపు చంద్రశేఖర్, గంటారమేష్ ల సహకారంతో బాధిత వ్యక్తికి జనసేనపార్టీ రాష్ట్రకార్యదర్శి ముఖరంచాంద్, పార్టీ అధికారప్రతినిధి కీర్తన ,మరియు కమలాపురం జనసేన నాయకులు వేణురెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కొట్టేరాజేష్, గౌస్ లాజమ్ మరియు ఇతర సిద్దవటం మండల జనసేన నాయకులు ద్వారా 35000 రూ.ల ఆర్ధిక సాయాన్ని అందజేయడం జరిగింది.