కిస్మస్ వేడుకలలో భాగంగా పాలకొండ జనసేన ఆత్మీయ సమావేశం

పార్వతిపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు, జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబెర్, స్నేహ టీవి మరియు అంబెడ్కర్ టీవి నియోజకవర్గ రిపోర్టర్ పొట్నూరు రమేష్ గృహం నందు క్రిస్టమస్ వేడుకలలో భాగంగా ఆత్మీయ కూడికతో కూడిన అతిధ్య భోజన కార్యక్రమంలో పాల్గోని జనవరిలో జరిగే యువశక్తి కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకోని వెళ్లే విధంగా చేయడానికి ఓ ప్రణాళిక ను ఆలోచించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసైనికులు గొర్ల మన్మధ రావు, పొరెడ్డి ప్రశాంత్, మత్స పుండరికం, జనసేన జానీ, కడగల హరికృష్ణ, బోర వాసు, చంటి, శేఖర్, సుధీర్, సంపత్, శ్రీకర్, శ్రీకాంత్, శంకర్, సాగర్, సోమేశ్, తదితరులు పాల్గొన్నారు.