కడవకుడురు గ్రామంలో జనసేన పార్టీ మండల కమిటీ సమావేశం

ఉమ్మడి ప్రకాశం జిల్లా, పర్చూరు, చిన్నగంజాం మండలం, కడవకుడురు గ్రామంలో ఆదివారం ఉదయం కమ్యూనిటీ హాల్ నందు మండల కమిటీ సమావేశం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి చిన్నగంజాం మండల అధ్యక్షులు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రతి శని, ఆదివారాలు మండలంలోని గ్రామాల్లోకి వెళ్ళటానికి తీర్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుర్రి వాసు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ తుమ్మలపెంట సతీష్, జనసేన నాయకులు తోట అశోక్ చక్రవర్తి, గంట వెంకటేష్, నరహరి గోపి, సందు విజయ, తమ్మన మహేష్, కొండూరు సాయి గౌతమ్, దాసరి నాని, గాజుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.