దోంకల పర్ట్ గ్రామములో జనసేన పార్టీ సభ్యత్వం మరియు ఇన్సూరెన్స్ కిట్ల పంపిణీ

ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో బూర్జ మండలం, దోంకల పర్ట్ గ్రామములో జనసేన పార్టీ సభ్యత్వం మరియు ఇన్సూరెన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది, మరియు ప్రజలందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేస్తున్నటువంటి 30 కోట్ల సహాయం గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీపతి, నాయుడు, మౌళి, శ్రీను, సంతోష్ నాయుడు, మోహన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.