ఈదుపల్లె గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

రేపల్లె నియోజకవర్గం: నగరం మండల పరిధిలో గల ఈదుపల్లె గ్రామంలో నగరం మండల అధ్యక్షులు ఉదయ్ కృష్ణ సారథ్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం కార్యక్రమము ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా క్రీయాశీల సభ్యత్వం తీసుకున్న నగరం మండల పరిధిలో ఉన్న పూడివాడ గ్రామానికికి చెందిన మొవ్వ రాజా ప్రమాద వశాత్తు గాయపడగా జనసేన పార్టీ తరుపున వచ్చిన ప్రమాద భీమా 50,000/- రూపాయల చెక్కుని గాదె వెంకటేశ్వరరావు అందించారు. అదే విధంగా మండల పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఎంపిక చేయబడిన గ్రామ అధ్యక్షులకి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తో పాటు మార్కెన్దేయ బాబు, ఆమంచి స్వాములు, అమ్మిశెట్టి వాసు, జిల్లా కార్యదర్శి భాస్కరరావు, జిల్లా ముఖ్య నాయకులు, నగరం మండల కమిటీ సభ్యులు, రేపల్లె నియోజకవర్గ జనసైనికులు, ఈదుపల్లె గ్రామ ప్రజలు పాల్గొన్నారు.