జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ సమావేశం

తూర్పుగోదావరి జిల్లా, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ విభాగ రాష్ట్ర స్థాయి సమావేశం రాజమహేంద్రవరంలో రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఏ వి ఎన్ ఎస్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ ఈవని సాంబ శివ ప్రతాప్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో పార్టీ న్యాయ మరియు పొలిటికల్ విభాగం యొక్క సమన్వయం మరియు ఎలక్షన్ ప్రక్రియలో లీగల్ సెల్ యొక్క పాత్ర పై చర్చించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు రాష్ట్ర, జిల్లా సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగినది మరియు రాజమండ్రి డిక్లరేషన్ ఆమోదించడమైనది. ఈ సమావేశంలో గౌరవ అతిధి రాజమహేద్రవరం నగర పాలక జనసేన పార్టీ అధ్యక్షులు వై.శ్రీనివాస్ కి గౌరవ సన్మానం చేయడమైనది.